Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 4:22 pm Posted by : ramakrishna

బ్యాంకులో చోరీకి యత్నం

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం జాతీయ రహదారి 44 పక్కనే ఉన్న పోచంపాడు బ్రాంచ్ ఎస్బిఐ బ్యాంకులో  తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నెహ్రు నగర్ గ్రామానికి చెందిన శ్యామ్ అనే యువకుడు షట్టర్ తాళం పగలగొట్టినట్టు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తెల్లవారుజామున మూడు గంటలకు ఉడుదుకె శ్యామ్ అనే వ్యక్తి బ్యాంకు ప్రధాన ద్వారమైన షట్టర్ తాళాలు పగలగొట్టాడు. తెల్లవారుజామున స్థానిక మండవ పోలీసులు పెట్రోలింగ్ లో భాగంగా  బ్యాంకుకు వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టినట్టు గమనించారు. దీంతో అక్కడే వేరు వేరు ప్రాంతాల్లో నిలబడి వేసి చూడగా శ్యామ్ దూదియం గ్రామం జాతీయ రహదారి నుండి నెహ్రు నగర్ గ్రామం వైపు వెళ్తుండడం గమనించారు. రాత్రివేళ ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నించగా కూలి పనికి వెళ్లి వచ్చినట్లు తెలిపి వెళ్లిపోయాడు. ఉదయం బ్యాంకు మేనేజర్ బ్యాంకు వచ్చి సిసిటివి వీడియోను పరిశీలించిన తరువాత  శ్యామ్ దొంగతనానికి యత్నించినట్లు గుర్తించారు. వెంటనే మెండోరా పోలీసులు శ్యామ్ ను అదుపులోకి తీసుకున్నారు.