Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 2:21 pm Posted by : ramakrishna

బల్దియా ఎన్నికల కలలు

 

. . . ఒకే రోజు రూ.60 కోట్ల పనులకు శంకుస్థాపన

. . . నిజామాబాద్ అర్బన్ కు క్యూ కట్టిన నాయకగణం

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

బల్దియా ఎన్నికల నగర ఎక్షణమైన మోగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పెద్ద ఎత్తున అభివ్రుధ్ధి పనులు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల గంట మొగడం ఖాయమైన నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనీజీలు, కల్వర్టుల పనుల కు ఆదివారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైన నిధులు గతంలో ప్రతి డివిజన్ కు రూ.20 లక్షల నిధులు చేసిన చివరి పనులు కాగా మళ్ళి ప్రతి డివిజన్ కు రూ. 1 కోటి నిధులు పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం జరిగింది.

Baldia election dreams

జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమా గౌడ్ తో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్న ఈ కార్యక్రమానికి నగర శాసనసభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ ముఖ్య అధ్యక్షత వహించి పాల్గొని భూమి పూజ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనుచరులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. అదికారుల కంటే లీడర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కనీసం పనులు ప్రారంభించడానికి సమయం లేకుండా హడావిడి శంకుస్థాపనలు రాజకీయ పార్టీల రంగుల కలలు నేరవేర్చుతాయో చూడాలి.

Baldia election dreams