. . . 0.6 టీఎంసీల నీరు విడుదల
నిజామాబాద్, బతుకమ్మ :
గోదావరిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతియేడాది జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచే సాంప్రదాయం కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో శనివారం ఎస్సారెస్పీ బాబ్లీ ప్రాజెక్టు అధికారులు, సీడబ్ల్యూసీ అదికారులు కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూజీడీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, నాందేడ్ డిఈ ప్రశాంత్ కదం, ఎఈఈ రవికొత్త, సచిన్ దేవ్ కాంబ్లే, బాబ్లీ ప్రాజెక్టు అధికారులు వినయ్, సుశాంత్, రిక్కి తదితరులు ఉన్నారు.
