బతుకమ్మ, కోటగిరి : నేటి సమాజంలో పోలీసుల వ్యవస్థ నిర్వహిస్తున్న పనితీరు పై విద్యార్థులకు ఓపెన్ హౌస్ పేరిట స్థానిక ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లో వచ్చిన బాధితుల సమస్యలు తెలుసుకోవడం అనంతరం ఆన్లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలనే అనే విషయాలపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. తమ పరిసర ప్రాంతాలలో ప్రమాదాలు జరిగిన, అసాంఘిక కార్యకలాపాలు జరిగిన భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.