Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:37 pm Posted by : ramakrishna

నందిపేట్ బస్టాండ్ లో అవగాహనా సదస్సు

 

. . . ప్రారంభించిన ఆర్ టీ సి డిఎం

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ బస్టాండ్ లో సర్పంచ్ సిలెండర్ లింగం ఆధ్వర్యంలో బుధవారం ప్రయాణికులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కి ముఖ్య అతిథులుగా డిఎం ఆనంద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రయాణికులు బస్సులు కదులుతున్న సమయంలో తగు భద్రత సూత్రాలు పాటించాలని, బస్సు ఎక్కే సమయంలో డ్రైవర్, కండక్టర్ కు సహకరిస్తూ క్యూ లైన్ పాటించాలని, ఆర్ టీ సి ని లాభాల బాటలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ టీ సి సీఐ జనాభాయ్, ఏడిసి యాదగిరి ఆర్ టీ సి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

Awareness seminar at Nandipet bus stand