విద్యార్థులకు జాగృతి భరోసానిస్తుంది
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, విద్యార్థులకు జాగృతి భరోసా నిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ -1 నియామకాల్లో అవకతవకలపై గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రూప్-1 విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నామన్నారు. 15వ తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే రౌండ్ టేబుల్...