ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు, ఇందల్వాయి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ నల్లవెల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో నాశ ముక్తా భారత్ అభియాన్లో భాగంలో డ్రగ్స్, మత్తుపదార్థాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు, వాళ్ళు సూచనలు చేశారు.మాదక ద్రవ్యాల దుష్పరిణామాల గురించి క్లుప్తంగా వివరించారు. మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయన్నారు. మాదకద్రవ్యాల వినియోగం నేరం చట్టపరమైన శిక్షకు లోనవుతారన్నారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉన్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు మంచి మార్గంలో నడుస్తుందన్నారు. ఎవరైనా మాదకద్రవ్యాల పైన పాల్పడినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సందీప్, ప్రిన్సిపాల్, విద్యార్థులు, పాల్గొన్నారు.