Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 7:23 pm Posted by : ramakrishna

రోడ్డు భద్రతపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని నాందేవ్ వాడలోని బీసీ బాలుర వసతి గృహంలో  గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై సూచనలు మౌఖికంగా, వీడీయోల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ కిరణ్, బిసి సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య, ఐడార్ జిల్లా మేనేజర్ వర్షా, వసతి గృహ అధికారులు రాజు, బాల కృష్ణ పాల్గొన్నారు.