బతుకమ్మ,మెండోరా : సైబర్ నేరాలకు పాల్పడేవారు రకరకాలుగా ఫోన్ కాల్స్ చేసి మిమ్మల్ని మాయమాటల్లో పడగొట్టి మీ నుంచి డబ్బు కాజేయడానికి ప్రయత్నాలు చేస్తారని అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని మెండోరా ఎస్సై యాసిర్ ఆర్వత్ అన్నారు. శుక్రవారం మెండోరా మండల కేంద్రంలో స్థానికులకు సైబర్ నేరాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఏవైనా తప్పుడు సమాచారంతో ఫోన్ కాల్స్ వస్తే సైబర్ కేంద్రానికి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.