బతుకమ్మ, పిట్లం : ప్రొడక్ట్ స్టీవర్ట్ షిప్ డే సందర్భంగా ఇన్సెక్టిసైడ్స్ (ఇండియా) లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు రైతు అవగాహన సదస్సును పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో నిర్వహించారు. రైతులను ఉద్దేశించి కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు పురుగుమందులను వాడే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు నరసింహ రెడ్డి, జగదీశ్వర్, వినయ్, ప్రవీణ్, జ్ఞానేశ్వర్ రైతులు పాల్గొన్నారు.