బహుమతుల ప్రదానం

బతుకమ్మ, వేల్పూర్ : మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు శివాజీ జయంతి రోజున శివాజీ జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి శివాజీ యూత్ విశ్వహిందూ పరిషత్ ఇందు యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బహుమతులు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ రాజన్న, సభ్యులు సుధాకర్, శ్రీనివాస్, రమేష్, సాయి, సురేష్, స్కూల్ ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.