నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని సుభాష్ నగర్ శనివారం ఓ ఆటో ద్విచక్ర వాహనంను ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. కంటేశ్వర్ నుండి సుభాష్ నగర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వస్తున్న అటో ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదే ప్రాంతంలో ఓ ప్రముఖ స్కూల్ ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం తమ పిల్లలను స్కూలు వద్ద దించడానికి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే సుభాష్ నగర్ ప్రాంతంలో ఈ పాఠశాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంటాయి. అయితే ప్రతిరోజు ఉదయం వేళలో ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఉండకపోవడం వల్లే ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదం కు గల కారణాలు పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
