Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 7:48 pm Posted by : ramakrishna

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో.. ఒకరు మృతి

ఇందల్వాయి, బతుకమ్మ : మంగళవారం గన్నారం గ్రామానికి చెందిన యావరేశెట్టి గంగ నరసయ్య  హెచ్ పి పెట్రోల్ బంక్లో వర్కర్ గా విధులు పూర్తిచేసుకుని గన్నారం  గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో పెద్దమ్మ గుడి దాటిన తర్వాత గన్నారం గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తలపై బలమైన గాయాలు కావడంతో అంబులెన్స్ లో నిజామాబాద్ హోప్ హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం శెట్టి గంగ నరసయ్య మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతుని భార్య యావర శెట్టి ఉమా ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ సందీప్ తెలిపారు.