Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 8:23 pm Posted by : ramakrishna

ఆటో డ్రైవర్లు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

 

భిక్కనూరు, బతుకమ్మ

 

ఆటో డ్రైవర్లు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఏ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. సోమవారం భిక్కనూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి మండలంలోని ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా చేసేందుకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని అందుకు వాహనదారులు తమతో సహకరించి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కంటి వైద్య సిబ్బంది, ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు.

 

Auto drivers must follow traffic rules