31న ఎక్సైజ్ నేరంలో పట్టుబడిన వాహనాల వేలం
మాక్లూర్, బతుకమ్మ : ఈనెల 31న ఎక్సైజ్ నేరంలో పట్టుబడిన వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ పి.స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో గల ఐఎంఎల్ డిపోలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేలం పాటకు సంబంధించిన వివరాలకు నిజామాబాద్ లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.