ప్రజాపాలనకు ఆకర్షితులై చేరికలు
బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. భీమ్ గల్ మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాగుల మోహన్, నేల రాజన్న, బిజెపి సీనియర్ నాయకులు భోజన్న, వార్డ్ మెంబర్ నరేష్, రాగుల కిషన్, మల్లెల అంజయ్య, కోలి రవి, వడ్ల అంజి, రాగుల హరీష్, రాజేందర్, గంగా నర్సయ్య, పల్లె చిన్నారెడ్డి, రాజయ్య, రాజ గంగయ్య, రఘు పలువురు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు....