Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 6:39 pm Posted by : ramakrishna

 ప్రజాపాలనకు ఆకర్షితులై చేరికలు

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. భీమ్ గల్ మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాగుల మోహన్, నేల రాజన్న, బిజెపి సీనియర్ నాయకులు భోజన్న, వార్డ్ మెంబర్ నరేష్, రాగుల కిషన్, మల్లెల అంజయ్య, కోలి రవి, వడ్ల అంజి, రాగుల హరీష్, రాజేందర్, గంగా నర్సయ్య, పల్లె చిన్నారెడ్డి, రాజయ్య, రాజ గంగయ్య, రఘు పలువురు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందర్నీ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలకడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.