బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని చిల్లరికి ప్రాథమిక పాఠశాల చిల్లర్గి పాఠశాల ను రాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీలత శుక్రవారం నాడు సందర్శించారు. పాఠశాలలో నమోదు చేస్తున్న అపార్ ఐడి పనులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఎఫ్ఏ 4 పరీక్షలు నిర్వహించాలని, ఆ తర్వాత మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలత, సిబ్బంది శ్రీనివాస్, విట్టల్, నవీన, ఆ ప్రాంత క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపాల్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.