కాంగ్రెస్ భవన్ ముట్టడికి యత్నం
. బీజేపీ, బీజేవైఎం నాయకుల అరెస్ట్ నిజామాబాద్, బతుకమ్మ: బీజేపీ రాష్ర్ట కార్యాలయంపై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ ముట్టడికి బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు యత్నించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం నాయకులు కాంగ్రెస్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. ముట్టడిలో బీజేవైఎం నాయకులు యాదాల నరేశ్, కార్తీక్ తదితరులున్నారు.