చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడిపై దాడి..

పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడిపై దాడి సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ సమీపంలోని ఇంట్లోకి చొరబడి రంగరాజన్ పై దాడి చేసి గాయపర్చారు. ఈఘటనపై  పోలీసులకు ఫిర్యాదు చేసిన రంగరాజన్ నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రస్తుతం రంగరాజన్ ఆరోగ్యంగా ఉండి.. ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.