పత్రిక స్వేచ్ఛపై దాడి దుర్మార్గం
కమ్మర్ పల్లీ, బతుకమ్మ: కమ్మర్ పల్లీ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాక్షి పత్రిక కార్యాలయాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కమ్మరపల్లి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాస రమేష్ యాదవ్, ప్రజాపంతా జిల్లా నాయకుడు సారా సురేష్ మద్దతు తెలిపారు