పేకాట స్థావరం పై దాడి, కేసు నమోదు

బతుకమ్మ ,మాచారెడ్డి: పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్ల పై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. మండలం లోని ఘన్పూర్ గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతుండగా ఎస్సై   పట్టుకుని వారి వద్ద నుండి మూడు బైకులు, నాలుగు మొబైల్స్ , 20 20 రూపాయలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన వివరించారు.