బాధిత కుటుంబానికి సహాయం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని 25 వార్డ్ కోటగల్లీలో ప్రమాదవశాత్తు జహీదా బేగం నివాస గృహం అగ్ని ప్రమాదానికి గురై వారి కుటుంబం రోడ్డు పాలు కావడంతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద షబ్బీర్ అలీ 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. పట్టణంలో వారికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని తెలిపారు.