యూపీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ను వర్చువల్ ప్రారంభించిన రాజ్ నాథ్..
వెబ్ న్యూస్, బతుకమ్మ : యూపీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ప్లాంట్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈసందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ మాట్లాడారు బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్ను అడగండని యోగి ఆదిత్యనాధ్ అన్నారు. బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు కోసం 80 హెక్టార్ల స్థలాన్ని తమ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని యోగి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రూ.300 కోట్లతో 80 హెక్టార్ల స్థలంలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేశామని, మూడున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.