Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 2:40 pm Posted by : ramakrishna

అశోక్ లే లాండ్ వాహనం దహనం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ పోర్ట్ వాహనాన్ని దహనమైంది.  అర్సపల్లి ప్రాంతంలోని నిజాంకాలనీలో పార్క్ చేసి ఉన్న అశోక్ లే లాండ్ (ఏపీ 25 డబ్ల్యూ 2737) వాహనానికి మంటలు అంటుకోవడంతో స్థానికు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో రూ.10లక్షల విలువైన వాహనం పూర్తిగా కాలిపోయింది. వాహనాన్ని ఎవరైనా దహనం చేశారా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.