Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 4:49 pm Posted by : ramakrishna

ఆశా కార్యకర్తల సమ్మె నోటీస్ అందజేత

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను  రద్దు చేసి, 29 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని ఆశా కార్యకర్తలన్నారు. ఈనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలందరూ పాల్గొననున్నామని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రుద్రూర్ పీహెచ్ సీలో మెడికల్ ఆఫీసర్ ఆయేషా సిద్దిఖా కు ఆశా కార్యకర్తలు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ మండల కార్యదర్శి వాణి, యూనియన్ నాయకులు ప్రవళిక, ప్రేమల, గంగామణి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.