Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 2:03 pm Posted by : ramakrishna

అర్సపల్లి ఎమ్మెస్సార్ బార్ సీజ్

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని  అర్సపల్లి ఎమ్మెస్సార్ బారును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. మధుశాల రెస్టారెంట్ అండ్ బార్ పేరు కలిగిన ఎమ్మెస్సార్ లో నౌకరి నామ రిజిస్టార్లు మెయింటెనెన్స్ చేయడం లేదని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ  దిలీప్, నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో  బార్ ను సీజ్ చేశారు. డాక్యుమెంట్లు మెయింటైన్ చేయడం లేదని, రిజిస్టర్ లు వాడటం లేదని ఫిర్యాదుల నేపథ్యంలో సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే బారును ఫీజు చేసినట్టు పేర్కొన్నారు.

Arsapally M.S.S.R. Bar Siege