Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 9:21 pm Posted by : ramakrishna

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

ఎడపల్లి, బతుకమ్మ :  డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఎడపల్లి పోలీసులు మండల కేంద్రంలో  పట్టుకున్నారు. నిజామాబాద్ నుండి మహారాష్ట్రకు అక్రమంగా 74 పీడీఎస్ రైస్ బ్యాగ్స్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ఏపీ 29 టీ 9473 ను ఆదివారం రాత్రి సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనాన్ని షేక్ అబ్బాస్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.  ఈ రైస్ బ్యాగ్స్ ను ప్రభుత్వ రేషన్ షాపు నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.