Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 9:04 pm Posted by : ramakrishna

ఏటీఎం ను ధ్వంసం చేసి దొంగతనానికి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్ 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ బిఐ ఎటియంను ధ్వంసం చేసి చోరీకి యత్నించిన వ్యక్తిని ఒకటవ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం ఈ నెల 27 తెల్లవారు జామున బస్టాండ్ దగ్గరలో గోడౌన్ రోడ్డు ఎస్ బిఐ  బ్యాంకు బ్రాంచ్ యొక్క ఏటీఎం ను ధ్వం సం చేసి దొంగతనానికి ప్రయత్నించారు. అతడిని పోలీసులు పట్టుకుని విచారించగా  హైదరాబాద్ కు చెందిన గ్యాన్ ప్రకాష్ చౌహాన్ అను  యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.