గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి 

 కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 15, 16వ తేదీలలో జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 15న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని, ఆ మరుసటి రోజైన 16వ తేదీన కూడా అవే సమయాలలో...