ఆర్మూర్ టౌన్, బతుకమ్మ: ఏప్రిల్ 30 న విడుదలైన పది ఫలితాలలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విధ్యార్ధులు విజయ దుందుభి మోగించారు. శివ మల్హర్ 586 మార్కులు, చింతల తన్వి 585 మార్కులు, చిలక అనన్య 584 మార్కులు, వేల్పుల రవితేజ 583 మార్కులతో రికార్డు సృష్టించారు అని ప్రిన్సిపల్ ముత్తు నందిపాటి అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను శాలువా తో సత్కరించారు. 500, ఆ పై మార్కులు 72 మంది లో 62 మంది విద్యార్థులు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముత్తు నందిపాటి, డీన్ రాకేష్ సి ఇన్చార్జి రాజేశ్వర్, అధ్యాపక బృంద పాల్గొన్నారు.