Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2024, 11:42 pm Posted by : ramakrishna

ఆర్మూర్ శ్రీ బాలాజీ జెండా ప్రతిష్టాపన

బతుకమ్మ, ఆర్మూర్ – ఆర్మూరు పట్టణము లోని శ్రీ వేంకటేశ్వర మందిరం ప్రాంగణం లో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు దంపతులు జండా పంతుల బృందం సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ శ్రావణ మాసం లో జండా బట్ట పూజ జరిగిన ఎనిమిది రోజులకు జండా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జండా ప్రతిష్ఠాపన ముఖ్య ఉద్దేశం, పెద వారు మరియు తిరుపతి వెళ్లి ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేని వారు సైతం ఈ యొక్క జండా బట్ట పూజలో ముడుపులు సమర్పించుకుని ఈ జండా ను దర్శనం చేసుకుంటే ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్టే అని కొన్ని వందల సంవత్సరలుగా భక్తుల నమ్మకం.

ఈ రోజు అనగా శ్రావణ మాసం తదియ రోజున జండా ను ప్రతిష్టించి తొమ్మిదవ రోజున అనగా ఆగస్టు 15 ఏకాదశి రోజున జండా జాతరను నిర్వహించి సాయంత్రం ఊరేగింపుగా  ఆర్మూరు పట్టణము సరిహద్దు అయినటువంటి అంకాపూర్ గ్రామ శివారం అంకాపూర్ సర్వ సమాజ్ సభ్యులకు  అప్పగించడం జరుగుతుంది. కావున ఆర్మూర్ పట్టణ మరియు పరిసరాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, కోశాధికారి లింగంపల్లి శివకృష్ణ,  సదర్లు గుండెటి మహేష్, బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, బ్రహ్మం, సర్వ సమాజ్ సభ్యులు, సదర్లు మరియు పెద్దమనుషులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Armor Shri Balaji flag installation