కామారెడ్డి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా భిక్నూర్ లో ఏ అర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు.తమ్ముడి బార్య, పిల్లల పై దాడి చేసి గాయ పరిచాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సంతోష్ అనే ఏ ఆర్ కానిస్టేబుల్ దారుణానికి తెగించాడు. సంతోష్ కామారెడ్డి జిల్లాకు చెందిన అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనలో తమ్ముడి భార్య నవ్య ,పిల్లలకు గాయాలు అయ్యాయి. బిక్ నూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.