నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సంఘాలన్నీ కలిసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని నెలకొల్పారు. దీనికి చిన్నయ్యను రాష్ట్ర చైర్మన్ గా ఎన్నుకున్నారు. మాలల తరపున చురుకుగా పని చేస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎడ్ల నాగరాజును, అంగరి ప్రదీప్ ను రాష్ట్ర కో చైర్మన్ లుగా నియమించారు. కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.