రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ఇంగ్లిష్ మీడియంలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో 40 సీట్ల ఖాళీలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తునట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి బి. శ్యామల ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
- సమర్పించవలసిన ధృవపత్రాలు :
పూర్వం చదివిన పాఠశాల బోనఫైడ్, ఇతర విద్యా సంబంధ భృవపత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, 4 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, జనన ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము,ఆరోగ్య ధృవీకరణ పత్రాలు జతపరచాలన్నారు.