నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అనేక పాఠశాలలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ, డ్రాయింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని పీఎం కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.మల్లేశం జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, మాధవి, శాంతాబాయి, రాజేంద్రప్రసాద్ రాములు, రజని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామచందర్ గైక్వాడ్, తెలంగాణ పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.