Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 6:06 pm Posted by : ramakrishna

మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్య కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం కళాశాల విద్యాలందరి చేత ప్రతిజ్ఞ మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. తాము మాదకద్రవ్యాల జోలికి పోమని, తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం జరిగితే పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చి, సమాజా రక్షణకు తోడ్పడుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.  ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, కళాశాల మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయకర్త డాక్టర్ వి శంకరయ్య, అధ్యాపకులు జె. శివకుమార్, అమరేశం ప్రభాకర్ రావు , డాక్టర్ అరుణ్ కుమార్, నాగానిక, చంద్రకాంత్, కృష్ణ ప్రసాద్, రాణి, సంతోష్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దు రాజు, మహమూద్, మోయిన్, స్వప్న, సురేష్ రెడ్డి, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Anti-drug pledge