వెబ్ న్యూస్, బతుకమ్మ : కోర్టుల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో న్యాయవాది వెంకటరమణ గుండెపోటుతో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే వెంకటరమణ మృతి చెందాడు. నిన్న హైకోర్టులో గుండెపోటుతో వేణుగోపాల్ రావు అనే న్యాయవాది మృతి చెందిన విషయం తెలిసిందే.