హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలోని మహిళా సంఘాలకు ప్రభుత్వం మరో 448 అద్దె బస్సులు కేటాయించింది. ఈమేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.