మిత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోనీ గాజులపేట్ లోని వివేకానంద చౌరస్తా వద్ద మిత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండగను  పురస్కరించుకొని సోమవారం వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  వినాయకునికి పూలమాలలు వేసి నైవేద్యాన్ని సమర్పించారు. నగరంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో ఆయురారోగ్యాలతో అందరు బాగుండాలని  కోరారు. అలాగే వీధి వీధిలో వాడవాడలో వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.