Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 5:45 pm Posted by : ramakrishna

ఏపీఎం మాణిక్యంను అభినందించిన ఈరవత్రి అనిల్

నందిపేట్,బతుకమ్మ: మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా నుంచి  జాతీయస్థాయిలో కేన్ స్లేవ్ 2025 కార్యక్రమంలో నందిపేట్ ఏపీఎం మాణిక్యం పాల్గొని ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్  చేతుల మీదుగా లక్ పతి దీదీ కాన్ స్లేవ్ 2025 ఒడిస్సా లోని భువనేశ్వర్ లో జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో ఏపీఎం మాణిక్యం ను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో నిలపడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.