Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 4:34 pm Posted by : ramakrishna

ఫైనాన్స్ అధికారుల అరాచకం

  • రుద్రూర్ లో బాధిత కుటుంబీకులపై  ఫైనాన్స్ అధికారుల వేధింపులు..

 

రుద్రూర్, బతుకమ్మ: ప్రెవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. కొందరు విచ్చలవిడిగా దందాను కొనసాగుతూ అప్పులు తీసుకున్న వారి రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. ఇష్టారాజ్యంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అనేక మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు    సామాన్యంగా, ఫైనాన్స్ సంస్థలు, ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్, డెయిలీ ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీలు వసూలు చేస్తూ, రుణాలు చెల్లించడంలో ఆలస్యం అయితే, రుణగ్రహీతలను వేధించే సందర్భాలు ఉన్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని  జేయన్సీ కలానీలో  ఓ ఇంటి పై బుధవారం పిన్ కో ఫైనాన్స్ అధికారులు వేధింపులకు గురించేశారు. కొన్ని సందర్భాల్లో ఈ వేధింపులు తీవ్రంగా ఉండి ఆత్మహత్యలకు కూడా దారి తీసే సూచనలు ఉన్నాయి.