Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 2:27 pm Posted by : ramakrishna

 విద్యాశాఖలో అక్రమాలపై విచారణ చేపట్టాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్యాశాఖలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి జ్వాల కోరారు. నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో అనుమతులు లేకుండా రెండు మూడు విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో గురువారం జ్వాల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈవోలు తనిఖీ చేయడం లేదని పేర్కొన్నారు. నారాయణ విద్యా సంస్థ ఆదివారం సైతం క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని, టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులపై చేస్తున్న ఒత్తిడిని ఖండిస్తున్నామన్నారు. ఫిర్యాదులు అందజేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు అలీ, సాగర్ సహాయ కార్యదర్శి , ప్రశాంత్ జిల్లా నాయకులు అజయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.