అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో శనివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.  అనంతరం వారు మాట్లాడుతూ అమీషా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రాజేందర్, రాజేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.