Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 4:23 pm Posted by : ramakrishna

ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్

 

. . . మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమానత్వానికి ప్రతీక,  అణగారిన వర్గాల కోసం ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, ఆయన గొప్ప ఆలోచనాపరుడు అని కొనియాడారు. సమాజంలో అన్యాయం ఎదురైతే పోరాడాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు.

 

Ambedkar was a man who fought tirelessly.

 

భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు అని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలవాలని ఉద్దేశంతో దేశంలో పంచ తీర్థాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, ట్రస్టు ప్రతినిధులు ధన్ పాల్ ఉదయ్, డాక్టర్ ధన్ పాల్ వినయ్, నాయకులు కృష్ణ మారావార్, పవన్ ముందడ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.