బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అంబేద్కర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ 41 డివిజన్ లో ఆయన జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 41 డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్, కుల సంఘ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.