బిచ్కుందకు చేరుకున్న అమర్నాథ్ యాత్రికులు
బతుకమ్మ, బిచ్కుంద : అమర్నాథ్ యాత్ర వెళ్లిన బిచ్కుంద యాత్రికులు నారం సాయి, నగేష్ గురువారం ఇక్కడకు సురక్షితంగా చేరుకున్నారు. యాత్రికులకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పట్టణ ప్రవేశ మార్గంలో ఎదురేగి స్వాగతం పలికారు. అవరోధాలను అధిగమించి అమర్నాథ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చిన యాత్రికులకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా బంధుమిత్రులు పూల వర్షం కురిపించారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రికులకు స్వాగత సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో భారీ వర్షాల కారణంగా కొండ...