బతుకమ్మ,వేల్పూర్:-మండలం లోని పడగల్ గ్రామంలో 2001-02 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అందరూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఒకరి కొకరు స్నేహపూర్వకoగ పలకరించుకుని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులు రంగాచారి, మదన్మోహన్, నర్సింలు, వెంకట్ నరసయ్య, నారాయణ, గోపీనాథ్, శ్రీమన్నారాయణ, రవి కుమార్ లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను దీవించారు.