బోధన్, బతుకమ్మ : బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాల ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. కళాశాల చెందిన 2008–10 బ్యాచ్ ఇంటర్ విద్యార్థులు ఈ సందర్భంగా ఒక్కచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్య ప్రకాష్, డైరెక్టర్ దుష్యంత్, అధ్యాపకులు కృష్ణ, రామ్ చరణ్, పల్లవి, రాములు,ప్రభాకర్, సాయిలు, దెవయ్య సన్మానించారు. రోజంతా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హై కోర్టు ఎజిపి లలిత, చందూ, లాల్ సింగ్ , నిఖిల్,శ్రీనివాస్, మహేష్ నందిని, , అనిత, హేమలత ,పాల్గొన్నారు.
