ఇందూర్, బతుకమ్మ :
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెచ్ పీవీ వ్యాక్సిన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు అంజి యాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల సురేష్ ఆధర్వంలో జనసేన నిజామాబాద్ జిల్లా నాయకులు గుండా సంతోష్ హెచ్ పీ పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మగుట్ట లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ లో హెచ్ పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు పాల్గొని వ్యాక్సిన్ ప్రాధాన్యత గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రమణ,న్యూ ప్రియదర్శని స్కూల్ ప్రిన్సిపల్ పుష్పలత, ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా, నగర కమిటీ సభ్యులు నవీన్,దీపక్, మహేష్,గోపి, బబ్లు,కార్తీక్,సుమంత్, విగ్నేష్, లక్ష్మణ్, శ్రీను, విజయ్, అభిమానులు పాల్గొన్నారు.